వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతులెత్తేసిన రాష్ట్రప్రభుత్వాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రభుత్వ సిబ్బందికి జీతాలు చెల్లించలేక 13 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేతులు ఎత్తివేశాయని కేంద్ర డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ శాఖ మంత్రి అరుణ్‌ శౌరి చెప్పారు. సంస్కరణల ప్రాధాన్యతను గుర్తించకుండా ఇంకా పాత శైలిలోనే పాలనా వ్యవహారాలను నిర్వహించడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. ప్రైవెటీకరణలో అంతర్జాతీయ అనుభవాలు అనే అంశంపై సోమవారం నాడు హైదరాబాద్‌లో ఏర్పాటయిన ఒక సదస్సులో ఆయన ప్రసంగించారు.

ఈ సదస్సులో అంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. కాలం చెల్లిన టెక్నాలజీ, ఏ మాత్రం గిట్టుబాటుగాని వ్యాపారం వల్ల పిఎస్‌యులను ప్రైవెటీకరించక తప్పడం లేదని అరుణ్‌శౌరి అన్నారు. దేశంలో సుమారు 946 ప్రభుత్వ రంగ సంస్థలు వుంటే వాటిలో 251 సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయని మరో 500 పైగా సంస్థలు నష్టాల్లో వున్నాయని ఆయన తెలిపారు. వేళ్లపై లెక్కించగల సంఖ్యలో మాత్రమే లాభాల బాటలో నడుస్తున్న పిఎస్‌యులు వున్నాయని ఆయన చెప్పారు.
కాగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం అనివార్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

సంస్కరణల వల్ల నిరుపేద, మధ్య తరగతి వర్గాలపై వత్తిడి పెరగకుండా తాము తగిన సామాజిక భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రైవెటీకరణ వల్ల పిఎస్‌యుల ఉద్యోగులు దెబ్బతినకుండా తాము విఆర్‌ఎస్‌, పునఃశిక్షణ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా కూడా ఆయన తెలిపారు. సంస్కరణల వల్ల ట్రాన్స్‌కో 500 కోట్ల రూపాయలమేర లాభపడినట్టుగా ఆయన వివరించారు. కొత్త అవకాశాలను గుర్తించి అందుకోవడానికి ప్రయత్నిస్తేనే నూతన ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా రూపొందుతుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X