వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్ర ఉద్యోగుల సమ్మెభేరి
హైదరాబాద్: తమ సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల సమాఖ్య సమరభేరి మోగించింది. సుమారు 10 లక్షల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 65 వేరువేరు సంఘాలకు చెందిన ప్రతినిధులు సోమవారం నాడు హైదరాబాద్లో సమావేశమై ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల విషయం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు.
ఈ
నెల
19
నుంచి
ప్రారంభించి
అంచెలవారీగా
ఉద్యమాన్ని
చేపట్టనున్నట్టు
ఉద్యోగుల
సంఘాల
నాయకులు
చెప్పారు.
ఈ
సమ్మెను
వచ్చే
జూన్లో
మరింత
ఉధృతం
చేస్తామని
వారు
హెచ్చరించారు.
ప్రభుత్వం
సిబ్బంది
సంఖ్యను
తగ్గించడం
వంటి
చర్యలు
చేపడితే
మెరుపు
సమ్మెతో
సమాధానం
చెబుతామని
వారు
హెచ్చరించారు.
తమ
డిమాండ్ల
విషయంలో
ప్రభుత్వం
ఉదాసీన
వైఖరిని
అవలంభిస్తున్నదని
వారు
పేర్కొన్నారు.
Comments
Story first published: Monday, April 9, 2001, 23:53 [IST]