వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేత కార్మికులకు స్వచ్ఛంద సహాయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. సిరిసిల్లాలో ఈ రోజు ప్రత్యేకమైన పరిస్థితి నెలకొని వున్నదని ఆయన అన్నారు.

మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం మాత్రమే ప్రయత్నిస్తే సరిపోదని స్వచ్ఛంద సంస్థలు కూడా నడుం కట్టాలని ఆయన చెప్పారు. సమగ్ర పథకాలకన్నా ప్రతిజిల్లాకు విడిగా ప్రత్యేక స్కీమ్‌ను డెవలప్‌చేసి నేత కార్మికులను ఆదుకోవాలని ఆయన అన్నారు. తగిన పనిలేక, ఉత్పత్తులకు మార్కెట్‌లేక దుర్భర దారిద్ర్యంతో అలమటిస్తున్న చేనేత కార్మికులను ఆదుకోవడానికి తక్షణ సహాయ కార్యక్రమాలతో పాటు వారికి శ్వాశ్వత ఉపాధిని కల్పించే దీర్ఘకాలిక చర్యలు కూడా చాలా అవసరమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X