వాజ్ పేయికి ఇరాన్ ఘనస్వాగతం
టెహరాన్ః భారత ప్రధాని అటల్బిహారీ వాజ్ పేయికి ఇరాన్ లో ఘనస్వాగతం లభించింది. నాలుగురోజుల అధికార పర్యటన కోసం మంగళవారం ఆయన ఇరాన్ రాజధాని టెహరాన్ చేరుకున్నారు. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో పాటు ఇరాన్ చేరుకున్న ప్రధానికి ఆ దేశ విదేశాంగ మంత్రి కమల్ ఖజారీ ఘనంగాస్వాగతం పలికారు. ఏడేళ్ళ కాలంలో ఇరాన్ ను సందర్శించిన భారత ప్రధాని వాజ్పేయి కావడం విశేషం. వాజ్ పేయి పర్యటన ఉభయ దేశాల ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాలులో నూతనాధ్యాయానికి నాంది పలకగలదని భావిస్తున్నారు.
తాలిబన్లపై
ఇరాన్తోచర్చ
న్యూఢిల్లీ:
అఎn్ఘానిస్తాన్లో
తాలిబన్ల
దురాగతాలపైతాను
ఇరాన్
నేతలతో
చర్చించనున్నట్టుగా
ప్రధాని
వాజ్పేయి
చెప్పారు.
మంగళవారం
ఉదయం
ఇరాన్
పర్యటనకు
బయలుదేరి
వెళ్లేముందు
విలేకరులతో
మాట్లాడుతూ,
తాలిబన్ల
విషయంలో
ఇరాన్,
భారత్
వైఖరి
ఒకే
విధంగా
వున్నదని
ఆయన
అన్నారు.
ఇరాన్-భారత్ల మైత్రికి అనేక శతాబ్దాల చరిత్ర వున్నదని ఆయన అన్నారు. వాణిజ్య, ఆర్ధిక రంగాలకు సంబంధించి ఉభయ దేశాల మధ్య ఇదివరకే సత్సంబంధాలు నెలకొని వున్నాయని తాజాగా సైన్స్, టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలపై తాను ఇరాన్ నేతలతో మంతనాలు జరుపుతానని ప్రధాని తెలియజేశారు.
ఇరాన్
పర్యటనలో
ప్రధాని
అక్కడ
పార్లమెంట్(మజ్లిస్)ను
ఉద్దేశించి
ప్రసంగిస్తారు.
భారత్తో
అనాదిగా
సంబంధాలు
వున్న
ఇరాన్లోని
పురాతన
నగరం
షిరాజ్ను
కూడా
ఆయన
సందర్శిస్తారు.
ఇరానీల
మతనాయకుడు
అయతుల్లా
ఖుమేనీని
కూడా
వాజ్పేయి
కలుసుకుంటారు.
ప్రధాని
పర్యటనతో
కలిసే
విధంగా
భారతీయ
పరిశ్రమల
సంఘం
ఫిక్కీకూడా
14
మంది
ప్రతినిధులతో
ఒక
బృందాన్ని
ఇరాన్
పంపిస్తున్నది.
ఉభయ
దేశాల
వాణిజ్య
సంఘాలు
ఏర్పాటు
చేసే
సమావేశంలో
కూడా
వాజ్పేయిప్రసంగించనున్నారు.