వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముగ్గురు నక్సల్స్ ఎన్కౌంటర్
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఒక ఎన్కౌంటర్లో పీపుల్స్వార్ గ్రూప్నకు చెందిన ముగ్గురు నక్సలైట్లు మరణించారు. జిల్లాలోని కడెం సమీపంలోని అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా సమాచారం వచ్చింది. అయితే మరణించిన నక్సలైట్ల వివరాలు మాత్రం తెలియరాలేదు.
నక్సలైట్ల అలకిడికి సంబంధించి తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు గాలింపు జరుపుతుండగా నక్సలైట్లు ఎదురయ్యారని తెలిసింది. పోలీసులను చూసిన నక్సలైట్లు కాల్పులు ప్రారంభించగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని తెలిసింది.
Comments
Story first published: Tuesday, April 10, 2001, 23:53 [IST]