వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

600 కోట్లతోజలయజ్ఞం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:600 కోట్ల రూపాయలతో ఈ ఏడాది జలయజ్ఞాన్ని చేపట్టాలనిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారు.ఆంధ్ర రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారణకు రానున్న80 రోజులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయనఅధికారులను ఆదేశించారు. నీరు మీరు కార్యక్రమాన్నిచక్కగా అమలు చేయని అధికారులపై ఆయనమండి పడ్డారు.

రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రాతిపదికపై తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం నాడు ముఖ్యమంత్రి తమ కార్యాలయంలో రాష్ట్రంలోని కరవు, మంచినీటి కొరత సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంజరిపారు.

నాబార్డ్‌ నుంచి తొలివిడతగా వచ్చిన 50 కోట్ల రూపాయల నిధులతో సత్వరం నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయనకోరారు. నీరు-మీరు కార్యక్రమం అనంతరం ఈ ఏడాది నీటి ఎద్దడి సమస్య తగ్గుముఖం పట్టిందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

ఈ సమావేశంలో, రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల గుర్తింపు కార్యక్రమం పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. కరవు పరిస్థితులు నెలకొన్ని జిల్లాలకు ఇదివరకే మంజూరు చేసిన రెండు కోట్ల రూపాయలు కాకుండా అవసరమైతే మరికొంత మొత్తాన్ని కూడా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నీటి ఎద్దడి విషయంలో అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్లలో నీళ్లను సప్లయి చేయాల్సిందిగా కూడా అధికారులను ఆయన ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X