వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నార్త్ బ్లాక్ వద్ద బాంబుస్వాధీనం
న్యూఢిల్లీ: నార్త్ బ్లాక్లోమంగళవారం రాత్రి అధికారులు శక్తివంతమైన బాంబునుకనుక్కున్నారు. అత్యంత కీలకమైన కేంద్రఆర్థిక, హోం మంత్రిత్వ శాఖల కార్యాలయాలుంటేనార్త్ బ్లాక్ రెండో నెంబర్ గేట్ వద్ద టిఫిన్క్యారియర్లో వున్న ఈ బాంబు అధికారుల కంటపడింది. ఒక టైమర్, రెండు డిటనేటర్లు, ఓబ్యాటరీలతో కూడిన 3.75 కిలోల బరువు గల బాంబుఇది.
హోంమంత్రిత్వ శాఖ అధికారులుకార్యాలయం నుంచి బయటకు వచ్చినప్పుడుఇది కనిపించిందని అధికార వర్గాలు చెప్పాయి. బాంబునుదుండగులు ఒక టిఫిన్ బాక్స్లో పెట్టి స్కూటర్మీద వుంచి వెళ్లిపోయారు. వెంటనే సంబంధితసిబ్బందిని పిలిపించి బాంబును నిర్వీర్యంచేశారు. దీంతో ఈ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లనుపెంచారు. భద్రతా ఏర్పాట్ల సమీక్షకు పోలీసుఉన్నతాధికారులు ప్రభుత్వాధికారులతో ఒక సమావేశంనిర్వహించారు.
Comments
Story first published: Wednesday, April 11, 2001, 23:53 [IST]