జిటిబికి రమేష్ గెల్లి రాజీనామా?
హైదరాబాద్: దేశంలోని నవతరం ప్రైవేట్ బ్యాంకుల్లో అతితక్కువ కాలంలోనే శరవేగంతో విస్తరించిన గ్లోబల్ట్రస్ట్ బ్యాంకు స్టాక్మార్కెట్ స్కామ్ పుణ్యమా అని సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నది. బ్యాంకు సారథి రమేష్గెల్లి చైర్మన్, మానేజింగ్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.
ముందుగా వచ్చిన వార్తల ప్రకారం గెల్లి సిఎండి జోడు పదవుల్లో ఎండి పదవిని వదిలి పెట్టనున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే జిటిబి షేర్ల ధరల రిగ్గింగు సంబంధించి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గెల్లి రెండు పదవులనుంచి తప్పుకోవాలని ప్రతిపాదిస్తున్నట్టుగా చెబుతున్నారు.
గురువారంనాడు
గ్లోబల్ట్రస్ట్బ్యాంకు
బోర్డు
సమావేశం
జరగనుండగా
సమావేశానికి
24
గంటల
ముందే
గెల్లి
తీసుకున్న
నిర్ణయం
బ్యాంకింగ్
వర్గాల్లో
సంచలనం
కలిగిస్తున్నది.
బ్యాంకింగ్
రంగంలో
అంతర్జాతీయంగా
లబ్ధప్రతిష్టుడైన
గెల్లిని
జిటిబికి
పర్యాయంగా
చెప్పవచ్చు.
జిటిబి
ప్రస్తుత
ఉన్నత
స్థితికి
ఆయన
వ్యూహాలే
ప్రధాన
కారణం.
ఈ
మధ్య
జిటిబికి
బడాబుల్
కేతన్
పరేఖ్
ఆపరేషన్స్తో
సంబంధం
వున్నట్టుగా
ఆరోపణలు
రావడం
తెలిసిందే.
ఆరోపణల
వల్ల
ఆఖరు
క్షణంలో
యుటిఐ
బ్యాంకుతో
విలీనం
ప్రతిపాదనకు
కూడా
జిటిబి
స్వస్తి
చెప్పాల్సివచ్చింది.