ఇచ్ఛంపల్లి కంటే ముందే ఎత్తిపోతలు
హైదరాబాద్: అంతర్రాష్ట్ర వివాదంలో చిక్కుకున్న ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు సాధనపై దృష్టి నిలుపుతునే ఈ లోగా గోదావరి జలాల వినియోగానికి ఎత్తిపోతల స్కీములను అమలు చేయాలని బుధవారం నాడు జరిగిన అఖిల పక్ష సమావేశం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కాంగ్రెస్, బిజెపి, వామపక్షపార్టీలు హాజరయ్యాయి.
ఇచ్ఛంపల్లి ప్రాజెక్టుకు నాలుగు రాష్ట్రాల అనుమతి కావల్సివున్నదని ఈ అనుమతులన్నీ వచ్చి ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి చాలా కాలం పట్టే అవకాశం వున్నదని సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ లోగా మాత్రం గోదావరి జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు హక్కు వున్న 360 టిఎంసి జలాల వినియోగానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని సభ్యులు పేర్కొన్నారు.
గోదావరి
పరివాహంలోని
నాలుగు
జిల్లాల్లో
కనీసం
50
టిఎంసిల
జలాల
వినియోగానికి
ఎత్తిపోతల
పథకాలను
ప్రారంభించాలనే
సూచనను
అన్ని
పార్టీల
సభ్యులు
ఆమోదించారు.
ఈ
50
టిఎంసిల
జలాలతో
కనీసం
5
లక్షల
ఎకరాలకు
సేద్యం
నీరు
అందించవచ్చని
రాష్ట్ర
భారీ
నీటిపారుదల
శాఖ
మంత్రి
మండవ
వెంకటేశ్వరరావు
చెప్పారు.
గోదావరిపై
ఏర్పాటు
చేయతలపెట్టిన
50
మధ్యతరహా
ప్రాజెక్టుల్లో
40
పైగా
ప్రాజెక్టులు
తెలంగాణ
జిల్లాల్లోనే
వున్నాయని
వెంకటేశ్వరరావు
చెప్పారు.
ఇదిలా వుండగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్ విషయంలో మాత్రం సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఎత్తిపోతల పథకాలకోసం 2000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సూచించింది. అయితే స్వయంప్రతిపత్తిగల సంస్థను ఈ స్కీమ్ల అమలుకు ఏర్పాటు చేయాలని ఆర్ధిక వ్యవహారాలన్నింటిని ఆ సంస్థకే అప్పగించాలని బిజెపి సభ్యులు సూచించారు. ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు సాధనకు ముందుగా ఎత్తిపోతల ద్వారా సాగును ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇందుకు అవసరమైన నిధులను కూడా కేటాయిస్తుందని మంత్రి మండవ తెలిపారు.