వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయ అర్హతపై ఇసిదే నిర్ణయం
మద్రాస్: రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎఐఎడిఎంకె అధినేత్రి జయలలిత అర్హరాలేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. టాన్సీ భూముల కేసులో ప్రత్యేక న్యాయస్థానం విధించిన జైలుశిక్షపై స్టే ఇవ్వాల్సిందిగా జయలలిత చేసిన అభ్యర్ధనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది.
ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షపై జయలలిత ఇప్పటికే అప్పీల్ చేసుకున్నందున ప్రత్యేకంగా దీనిపై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ మలై సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హురాలిగా తనను ప్రకటించాలన్న జయలలిత విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ, ఏ కోర్టు కూడా జయకు శిక్షను ఇంకా ఖరారు చేయనందున ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హురాలేనని న్యాయమూర్తి చెప్పారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం ఎన్నికల కమిషన్దే నని ఆయన స్పష్టం చేశారు.
Comments
Story first published: Wednesday, April 11, 2001, 23:53 [IST]