అద్వానీ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించిన వ్యవహారంలో కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్కె అద్వానీ జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలం పై వామపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశాయి. అద్వానీ ప్రకటన కమిషన్ను తప్పుతోవ పట్టించడమేనని వామపక్షాలు పేర్కొన్నాయి. తహల్కా వివాదంలో ఇరుక్కున్న బీజేపీ నేతలు ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బాబ్రీ వివాదాన్ని మళ్లీ కెలుకుతున్నాయని వారు ఆరోపించారు.
కాగా బాబ్రీ విధ్వంసంపై అద్వానీ విచారం ప్రకటించినందున విధ్వంసంలో పాల్గొన్న కార్సేవకులను శిక్షించాలని బిఎస్పి నాయకురాలు మాయావతి డిమాండ్ చేశారు. వివాదాస్పద కట్టడం మసీదు కాదని మొదటినుంచి అది ఆలయమేనని అద్వానీ కమిషన్ ముందు చెప్పడాన్ని ఆమె ఎద్దేవ చేశారు. అక్కడ ఆలయమే వుంటే దానిని కార్సేవకులు ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటని కూడా మాయ ప్రశ్నించారు.
అద్వానీ
ప్రకటన
సంఘ్
పరివార్లో
మాత్రం
ఆనందోత్సాహాలను
రేకెత్తించింది.
అద్వానీ
చేసిన
ప్రకటన
పట్ల
విశ్వహిందూ
పరిషత్
నేత
ఆచార్య
గిరిరాజ్
కిషోర్
హర్షం
వ్యక్తం
చేశారు.