కాంగ్రెస్తో పొత్తు వుండదు: సిపిఎం
హైదరాబాద్: వచ్చేపంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు వుండదని సిపిఎం స్పష్టంచేసింది. తాము తొమ్మిది వామపక్షాలతో కలిసిపంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని సిపిఎం రాష్ట్రకార్యదర్శి బి.వి. రాఘవులు గురువారం విలేకరులసమావేశంలో చెప్పారు.
పంచాయతీరాజ్ ఎన్నికల్లో తాముకాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబోమని సిపిఐ కూడా స్పష్టంచేసింది. అయితే, తాము కాంగ్రెస్తో అవగాహనకువస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిబుధవారం చెప్పారు. తాము పోటీ చేయని చోట్లకాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తామని,బిజెపి, తెలుగుదేశం కూటమిని ఓడించేందుకుఇది అవసరమని ఆయన అన్నారు.
కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగాసిపిఐ, సిపిఎంలతో సహా తొమ్మిది వామపక్షాలు ఆందోళనచేశాయి. అప్పుడు కూడా కాంగ్రెస్తో సమన్వయంతో ఈ పార్టీలు పనిచేశాయి. బహుశా, పంచాయతీరాజ్ ఎన్నికల్లోనూవామపక్షాలకు, కాంగ్రెస్కు మధ్య ఇటువంటిఅవగాహనే వుండవచ్చు.