గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాట-47మంది మృతి
జోహెన్స్బర్గ్: దక్షిణాఫ్రికాలోనిజోహెన్స్బర్గ్లో గల ఫుట్బాల్ మైదానంవద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం 47 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. దక్షిణాఫ్రికాకుచెందిన రెండు టాప్ టీమ్ల మధ్య జరుగుతున్న ఫుట్బాల్మ్యాచ్ను చూడడానికి ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగిపిల్లలు, స్త్రీలతో సహా 47 మంది మరణించారు.
ఎంత మంది మరణించివుంటారనే విషయాన్ని, ఎంత మంది గాయపడ్డారనేవిషయాన్ని నిర్ధారించడానికి తాము ప్రయత్నిస్తున్నామని పోలీసువర్గాలంటున్నాయి.
కింద పడిపోయిన పలువురికి అక్కడికక్కడేవైద్యులు చికిత్స ప్రారంభించారు. మరికొంతమందిని ఆస్పత్రులకు తరలించారు. ఎల్లిస్ పార్క్స్టేడియం లోపల కనీసం 33 మృత దేహాలు,వెలుపల 14 శవాలు వున్నాయని పోలీసు అధికార ప్రతినిధిఅమందా రోయెస్టాఫ్ చెప్పారు. మైదానంప్రేక్షకులతో నిండిపోయిన తర్వాత కూడా ప్రజలు టికెట్ల కోసం ఎగబడ్డారు. లక్షా 20వేల టికెట్లు అమ్మారు. దీంతో మ్యాచ్ 35 నిమిషాల పాటునిలిచిపోయింది. ఆ సమయానికి రెండు జట్లు 1-1గోల్స్తో సమానంగా వున్నాయి. వైద్య సహాయం నిమిత్తంహెలికాప్టర్లను వాడుతున్నారు. పరిస్థితిబీభత్సంగా వుంది.