జయ వినతిపైసుప్రీంలో కేవియట్
చెన్నై: టాన్సీ కేసులలో న్యాయస్థానం తనకువిధించిన శిక్షలను మే 10వ తేదీన జరుగనున్న తమిళనాడుఅసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు వీలుగా సస్పెండ్చేయాలని అన్నాడియంకె నేత జయలలితదాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులోకేవియట్ వేయాలని తమిళనాడు ప్రభుత్వంనిర్ణయించింది. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ఆర్. షణ్ముగం గురువారం చెప్పారు. మద్రాసుహైకోర్టు న్యాయమూర్తి మలాయి సుబ్రహ్మణ్యన్ ఇచ్చిన తీర్పుపై గురువారంవివరణ కోరడానికి వెళ్లినప్పుడు హైడ్రామానడిచింది.
తన తీర్పుపై తాను వివరణఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ మలాయిసుబ్రహ్మణ్యన్ చెప్పారు. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపైవివరణ అవసరం లేదని జయలలిత తరఫున్యాయవాది అన్నారు. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుజయలలిత పోటీ చేయడానికి అర్హురాలా, కాదా అనేవిషయంలో అయోమయం సృష్టించిన విషయం తెలిసిందే.మద్రాసు హైకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పుపైవివరణ కోరుతూ జయలలిత తరఫు న్యాయవాదిదాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకోవడంతో తన తీర్పుపైవివరణ అవసరం లేదని జస్టిస్ మలాయిసుబ్రహ్మణ్యన్ చెప్పారు.