అఖిలపక్షంపై మల్లగుల్లాలు
న్యూఢిల్లీ: ప్రధాని వాజ్పేయి శనివారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై వివిధ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తహల్కావివాదంపై తొలివిడత సమావేశాలను స్తంభింపజేసిన ప్రతిపక్షాలు ఈ రెండో విడత సమావేశాల్లో కూడా సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తాయనే అనుమానంతో ప్రభుత్వం వుంది.
సోమవారం
నుంచి
ప్రారంభమవుతున్న
పార్లమెంట్
రెండో
విడతబడ్జెట్
సమావేశాలు
సవ్యంగా
సాగేలా
ప్రతిపక్షాలను
ఒప్పించేందుకు
ఈ
అఖిలపక్ష
సమావేశాన్ని
ప్రధాని
ఏర్పాటు
చేశారు.బడ్జెట్కు
సభ
ఆమోదం
సజావుగా
లభించేలా
సహకరించాల్సిన
బాధ్యత
కాంగ్రెస్పై
వున్నదని
బీజేపీ
నేతలుఅంటున్నారు.
అఖిల
పక్షంలో
కాంగ్రెస్
నుంచి
స్పష్టమైన
హామీ
తీసుకోవాలని
వారు
భావిస్తున్నారు.
అయితే
పార్లమెంట్లో
తమ
పార్టీ
అనుసరించే
వ్యూహాన్ని
అఖిలపక్షంలో
వెల్లడించరాదని
కాంగ్రెస్
నిర్ణయించింది.
అఖిల
పక్ష
సమావేశంలో
తమ
వైఖరిని
గురించి
చర్చించేందుకు
కాంగ్రెస్
అగ్రనేత
సోనియా
గాంధీ
శుక్రవారం
సాయంత్రం
తన
నివాసగృహంలో
చర్చలు
జరిపారు.
మరోవైపు
వామపక్షపార్టీలు
కూడాబడ్జెట్
సమావేశాల్లో
ఎలాంటి
వ్యూహాన్ని
అనుసరించేది
బయటకు
వెళ్లడించడం
లేదు.