వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిల్లర్లుకు సిఎం హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రబి సీజన్‌లో దిగుబడి గణనీయంగా వున్న కారణంగా రైతులను మోసగించి గిట్టుబాటు ధరకంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రయత్నించే మిల్లర్లపై కఠిన చర్య తీసుకోవాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

శుక్రవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్లు, ఎఫ్‌సిఐ అధికారులతో విడియో కాన్ఫరెన్సింగ్‌ జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇతర జిల్లాల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుక్కువచ్చి ఎఫ్‌సిఐకి అమ్మడానికి ప్రయత్నించే మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేసే ప్రయత్నాలను వమ్ము చేయాలని ఆయన ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X