కేరళ కాంగ్రెస్లో సమసినసంక్షోభం?
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కరుణాకరన్ తిరుగుబాటు దరిమిలా కేరళ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభం సమసిపోయినట్టుగా కాంగ్రెస్ గులాంనబి ఆజాద్ ప్రకటించారు. అధిష్టానవర్గం దూతలుగా వచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు గులాం నబి ఆజాద్, మోతిలాల్ వోరా శుక్రవారం నాడు కరుణాకరన్తోనూ సిడబ్లుసి సభ్యుడు ఎకె ఆంటోనితోనూ చర్చలు జరిపారు.
సుదీర్ఘంగా
జరిగిన
చర్చలు
ఫలప్రదం
అయ్యాయని
ఆజాద్
వెల్లడించారు.
ఈ
చర్చల్లో
తన
కుమార్తె
పద్మజకు
టికెట్
ఇవ్వాలని
మరో
ఇద్దరు
అనుచరులకు
కూడా
టికెట్
ఇవ్వాలని
కరుణాకరన్
పట్టుబట్టినట్టుగా
తెలిసింది.రాష్ట్ర
అసెంబ్లీకి
జరుగుతున్న
ఎన్నికల్లో
సీట్ల
కేటాయింపులో
తమ
వర్గంవారికి
అన్యాయం
జరిగిందని
కరుణాకరన్
ఆగ్రహించిన
విషయం
విదితమే.
అన్ని
నియోజకవర్గాల్లో
తిరుగుబాటు
అభ్యర్ధులను
నిలబెడతానని
కరుణాకరన్
ప్రకటించడంతో
కాంగ్రెస్
నాయకత్వం
బెంబేలెత్తింది.
శుక్రవారం
నాటి
చర్చల్లో
సమస్యలు
అత్యధిక
భాగం
పరిష్కారం
అయ్యాయని
అపరిష్కృతంగా
వున్న
ఒకటి
రెండు
సమస్యలను
తాము
తర్వాత
పరిష్కరించుకుంటామని
ఆజాద్
చెప్పారు.
రాష్ట్రంలో వామపక్ష కూటమిని ఓడించే విషయంలో కలసికట్టుగా పోరాడాలనే విషయంలో కరుణాకరన్, ఆంటోని ఇద్దరూ కృతనిశ్చయంతో వున్నారని ఆయన చెప్పారు. అయితే కరుణాకరన్ గానీ ఆయన అనుచరులు గానీ ఈ చర్చల విషయంలో ఏలాంటి ప్రకటన చేయకపోవడంతో పరిశీలకులు చర్చల సాఫల్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.