వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నీటి ప్రాజెక్టులసాధనకు ఐక్యపోరాటం
హైదరాబాద్: తెలంగాణాలోనినీటి పారుదల ప్రాజెక్టుల సాధనకు ఐక్య పోరాటంచేయాలని 12 సంఘాలు, సంస్థలతో కూడినఐక్యవేదిక నిర్ణయించింది. ఈ ఐక్య పోరాటానికి వ్యవసాయ రంగ పరిరక్షణఐక్యవేదిక ఏర్పడింది. నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టకుండా ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు నీరు-మీరు పేరుతో ప్రజలదృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారనిఐక్యవేదిక నాయకుడు బి.ఎన్. రెడ్డి శుక్రవారంవిలేకరుల సమావేశంలో విమర్శించారు.
నీటి సమస్యను శాశ్వతంగాపరిష్కరించే నీటి పారుదల ప్రాజెక్టులనుకాదని చంద్రబాబు ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పుతున్నారనిఆయన అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులు చేపడితేనే భూగర్భ జలాలమట్టం పెరుగుతుందని ఆయన చెప్పారు. తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని ఖరారుచేసుకునేందుకు త్వరలో సమావేశం అవుతామనిఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, April 13, 2001, 23:53 [IST]