వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖలో లుంబిని ఉత్సవాలు
విశాఖపట్నం: విశాఖపట్నంలో వచ్చేనెల 8,9 తేదీల్లో భారీ ఎత్తున లుంబిని ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర టూరిజం శాఖ నిర్ణయించింది. ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బౌద్దుల మత గురువు దలైలామా కూడా పాల్గొనే అవకాశం వుండటంతో అధికారులు ఇప్పటినుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఈ
ఉత్సవాలకు
పెద్ద
సంఖ్యలో
పర్యాటకులను
ఆకర్షించాలని
ప్రభుత్వం
యోచిస్తున్నది.
విశాఖపట్నానికి
సుమారు
15
కిలోమీటర్ల
దూరంలో
సముద్రతీరంలోని
తోట్లకొండ,
బావికొండ
ప్రాంతాల
వద్ద
లుంబినిఉత్సవాలకు
ఏర్పాటు
జరుగుతున్నాయి.
ఈ
ప్రాంతంలో
రెండు
వేల
సంవత్సరాలకు
పూర్వం
బౌద్ధ
ఆరామాలు
విలసిల్లినట్టుగా
చరిత్రకారులు
చెబుతున్నారు.
ఇప్పటికీ
నాటి
అవశేషాలు
అక్కడ
వున్నాయి.
ఈ
ఉత్సవాల
కోసం
కోటి
రూపాయల
వరకు
ఇప్పటికే
ఖర్చు
చేసినట్టుగా
అధికారులు
ప్రకటించారు.
Comments
Story first published: Friday, April 13, 2001, 23:53 [IST]