వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో లుంబిని ఉత్సవాలు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నంలో వచ్చేనెల 8,9 తేదీల్లో భారీ ఎత్తున లుంబిని ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర టూరిజం శాఖ నిర్ణయించింది. ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బౌద్దుల మత గురువు దలైలామా కూడా పాల్గొనే అవకాశం వుండటంతో అధికారులు ఇప్పటినుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. విశాఖపట్నానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో సముద్రతీరంలోని తోట్లకొండ, బావికొండ ప్రాంతాల వద్ద లుంబినిఉత్సవాలకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో రెండు వేల సంవత్సరాలకు పూర్వం బౌద్ధ ఆరామాలు విలసిల్లినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పటికీ నాటి అవశేషాలు అక్కడ వున్నాయి. ఈ ఉత్సవాల కోసం కోటి రూపాయల వరకు ఇప్పటికే ఖర్చు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X