రాజ్యాంగసమీక్షపై దత్తాత్రేయహామీ
హైదరాబాద్: సామాజిక అసమానతలనుతొలగించేందుకే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సమీక్షకుపూనుకుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖసహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం నాడుహైరాబాద్లో డాక్టర్ అంబేద్కర్ జయంతిఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రినిఉస్మానియా, సెంట్రల్ యూనివర్శిటీలకు చెందినవిద్యర్ధులు రాజ్యాంగ సమీక్షకు వ్యతిరేకంగా ఘెరావ్ చేసినసందర్భంగా దత్తాత్రేయ ఈ విషయంస్పష్టంచేశారు. సమీక్ష ద్వారా రాజ్యాంగ మౌలిక స్వభావాన్నిమార్చే ప్రశ్నే లేదని ఆయన స్పష్టంచేశారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగాహైదరాబాద్లో కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధిఎస్. జైపాల్రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి, నివాళులర్పించారు. ప్రభుత్వరంగ సంస్ధలను ప్రయివేట్ పరంచేయటం, ప్రభుత్వ రంగ సంస్ధలలో ఖాళీగావున్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవటం ద్వారారిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడుతున్నదనిఅన్నారు.