వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎంసిసి దాడి: 14మంది బలి
న్యూఢిల్లీ: జార్ఖండ్లో శనివారంఉదయం మావోయిస్టు కమ్యునిస్ట్ సెంటర్ (ఎంసిసి)తీవ్రవాదులు మరోసారి పంజా విసిరారు. వారు జరిపినదాడిలో 14 మంది మృతి చెందారు. హజారీబాగ్కు 80 కిలోమీటర్లదూరంలోని ఓ కుగ్రామంలో ఈ సంఘటనజరిగింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎంసిసితీవ్రవాదులు విరుచుకుపడి ఒకే కుటుంబానికిచెందిన 14 మందిని హతమార్చారు.
హత్యాకాండ అనంతరంతీవ్రవాదులు గుడిసెలకు నిప్పంటించటంతో ఓ 18 ఏళ్ల యువతిసజీవదహనమయ్యింది. ఈ సంఘటనతోఆగ్రహించిన గ్రామస్తులు గ్రామంలోకి అధికారులు,నాయకులనెవరినీ అనుమతించటంలేదు. ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండి గ్రామాన్నిసందర్శించేంతవరకూ శవాలను కదలనియ్యమని గ్రామస్తులు భీష్మించుకుకూర్చున్నారు. సంఘటనకు పాల్పడినతీవ్రవాదులకోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టుసమాచారం.
Comments
Story first published: Saturday, April 14, 2001, 23:53 [IST]