మల్టీ మోడల్సిస్టమ్కు కదలిక
హైదరాబాద్: హైదరాబాద్లో తలపెట్టినమల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టునుత్వరలో ప్రారంభిస్తామని రైల్వే శాఖ సహాయ మంత్రిరాజగోపాలన్ హామీ ఇచ్చారు. ఆయన ఆదివారంసికింద్రాబాద్లోని దక్షిణ, మధ్య రైల్వేకార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలోప్రసంగించారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన ఏడాది లోపల పూర్తి చేస్తామనిఆయన చెప్పారు. మల్టీ మోడల్ ట్రాన్సిట్సిస్టమ్ ప్రాజెక్టును చేపట్టేందుకు మాజీరైల్వే మంత్రి మమతా బెనర్జీ రాష్ట్రప్రభుత్వానికి హామీ ఇచ్చింది. మమతా బెనర్జీ చేసినవాగ్దానాన్ని నెరవేరుస్తామని ఆయన చెప్పారు.
రైల్వే ప్రాజెక్టులకు పార్లమెంటు సభ్యులు తమనిధుల నుంచి కొంత కేటాయించాలని ఆయనసూచించారు. నిజామాబాద్- హైదరాబాద్ గేజ్ మార్పిడి పనులనునిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేస్తామనిఆయన చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీఇచ్చారు.
రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులనుసత్వరమే పూర్తి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖసహాయ మంత్రి, సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు బండారు దత్తాత్రేయరైల్వే సహాయ మంత్రిని కోరారు. రైల్వే ప్రాజెక్టులకు తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లరూపాయల కేటాయించినట్లు ఆయన తెలిపారు.