బాల్కో చర్చలువిఫలం
న్యూఢిల్లీ: బాల్కో పై ఢిల్లీలో జరిగిన త్రైపాక్షిక సమావేశం విఫలమైంది. గత 45 రోజులుగా సాగుతున్న బాల్కో కార్మికుల సమ్మెను పరిష్కరించడానికి వీలుగా చత్తీస్గఢ్ ప్రభుత్వం, బాల్కో కార్మిక సంఘాలు, కేంద్రప్రభుత్వ ప్రతినిధులు సోమవారం నాడు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో మూడు రకాల ప్రతిపాదనలను చత్తీస్గఢ్ ప్రభుత్వం, బాల్కో కార్మికసంఘాలు కేంద్రం ముందు వుంచాయి. స్టెరిలైట్ ఇండస్ట్రీస్కు విక్రయించిన 51 శాతం వాటాను ప్రభుత్వం వెనక్కి తీసుకుని వ్యూహాత్మక భాగస్వామికి కేవలం 40 శాతం వాటా విక్రయించాలని 10 శాతం బాల్కో కార్మిక సంఘాలకు విక్రయించి మిగిలిన 50 శాతం కేంద్ర ప్రభుత్వం వద్ద వుంచుకోవాలని వారు ప్రతిపాదించారు.
లేదంటే
కేంద్ర
రాష్ట్ర
ప్రభుత్వాలు
బాల్కోను
సంయుక్తంగా
నిర్వహించాలని
వారు
కోరారు.
సింగరేణి
కాలరీస్ను
ఆంధ్రప్రదేశ్,
కేంద్రం
సంయుక్తంగా
నిర్వహిస్తున్న
విషయం
వారు
ఈ
సందర్భంగా
ప్రస్తావించారు.
అయితే
ఈ
ప్రతిపాదనలను
కేంద్రం
తిరస్కరించింది.
ప్రైవేటీకరణ
విషయంలో
వెనక్కి
తగ్గేది
లేదని
కేంద్రం
స్పష్టం
చేసింది.
ప్రైవేటీకరణను
పూర్తిగా
వ్యతిరేకించిన
కార్మిక
సంఘాలు
తమ
పట్టును
కొద్దిగా
సడలించుకోగా
కేంద్రం
మాత్రం
అదే
పంతం
కొనసాగిస్తున్నదని
విమర్శలు
వస్తున్నాయి.
కాగా
ఈ
నెల
19న
జరిగే
సమావేశంలో
భవిష్యత్కార్యాచరణను
ఖరారు
చేయనున్నట్టుగా
కార్మిక
సంఘాల
ప్రతినిధులు
చెప్పారు.