27న డిఫ్యూటీస్పీకర్ కొత్తపార్టీ
హైదరాబాద్: డిఫ్యూటీస్పీకర్ కె. చంద్రశేఖర్రావు ఎట్టకేలకు కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుప్రకటించారు. ఈనెల 27న తెలంగాణా ప్రత్యేక రాష్ట్రసాధనకోసం తెలంగాణా రాష్ట్ర సమితిపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుఆయన ప్రకటించారు. ఇందుకుగాను తానుతెలుగుదేశం పార్టీకి గుడ్బై చెబుతున్నట్టు తెలిపారు. ఆజ్తక్ టివీ ఛానల్కు ఇచ్చినఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం తెలిపారు. ఇంటర్వ్యూహైలెట్స్ను ఆజ్తక్ టివీ చానల్ ఆదివారం నాడు పత్రికలకువిడుదల చేసింది. తెలుగుదేశం పార్టీకిచెందిన నలుగురు ఎమ్మల్యేలు కూడా కొత్తపార్టీలో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. ఈనెల 27వ తేదీనకరీంనగర్లో ఏర్పాటు చేసిన ర్యాలీలో కొత్త పార్టీని లాంఛనంగా ప్రకటిస్తామనిఆయన చెప్పారు. ఈ ర్యాలీకి ఛత్తీస్ఘడ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడాఆహ్వానిస్తున్నామన్నారు. ప్రత్యేక తెలంగాణాసాధించాలన్న తన ఆశయ సాధనకు కాంగ్రెస్, బిజెపిలమద్దతు కూడా వుందన్నారు.
రానున్న పంచాయితీఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్ధులు పోటీచేస్తారన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలుచంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని బహిర్గతంచేశాయన్నారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని ప్రజలుఅర్ధం చేసుకున్నారన్నారు. తెలంగానా ప్రాంత అభివృద్దినిచంద్రబాబు పట్టించుకోవటం లేదని చంద్రశేఖరరావు దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రచారప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. తనపాలనలో చంద్రబాబు తెలంగాణా అభివృద్ధికోసం తీసుకున్న ఒకమంచి ప్రాజెక్టు ఏమిటో తెలపాలని ఆయన నిలదీశారు. ప్రత్యేక తెలంగాణాసాధనకోసం జన సమీకరణ చేస్తామని చంద్రశేఖరరావుచెప్పారు.