వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నామినేషన్లపర్వం ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు మేలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు సోమవారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేశారు. సోమవారం నుంచి ప్రారంభించి నామినేషన్లు ఈ నెల 23 వ తేదీ వరకు స్వీకరిస్తారు.

నామినేషన్ల ఉపసంహరణకు గడవు 26వ తేదీ వరకు వుంటుంది. కాగా ఓట్ల లెక్కింపు మే13 నుంచి ప్రారంభమవుతుంది. ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండా అధికారులు ఫలితాలు ప్రకటించరాదనే కొత్త నిబంధనను ఈ సారి ఎన్నికల నోటిఫికేషన్‌లో చేర్చారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 1997 మార్గదర్శక సూత్రాలనే ఎన్నికల కమిషన్‌ ఇప్పుడు కూడా అమలు చేస్తుందని ఈ విషయంలో మార్పు లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గిల్‌ చెప్పారు. జయ విషయంలో మాత్రం ఆయన ఏలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇదిలా వుండగా నామినేషన్ల పర్వం ప్రారంభమైన తొలిరోజు సోమవారం నాడు అయిదు రాష్ట్రాల్లోని వివిధ నియోజకవర్గాల్లో మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X