వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాసైన్యం చొరబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: బంగ్లాదేశ్‌ సైనికదళాలు ఈశాన్యరాష్ట్రాల్లోని భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. మేఘాలయలోని సరిహద్దు పట్టణం దాక్వీకి నాలుగుకిలోమీటర్లదూరంలో వున్న ఒక గ్రామాన్ని బంగ్లాదేశ్‌ సైన్యం తన నియంత్రణలోకి తీసుకున్నట్టుగా సమాచారం అందింది. అంతేకాకుండా ఈ గ్రామం సమీపంలోని బిఎస్‌ఎఫ్‌ పోస్ట్‌ను కూడా బంగ్లా బలగాలు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది.

ఈ పోస్టులో సుమారు 30 మంది బిఎస్‌ఎఫ్‌ సిబ్బంది వుండవచ్చని అంచనా. ఇదిలావుండగా చెక్‌పోస్ట్‌ను బంగ్లా బలగాలు స్వాధీనం చేసుకోవడానికి ముందు కొద్ది సేపు కాల్పులు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. కాగా బంగ్లా బలగాల కాల్పులతో బెదిరిపోయిన మేఘాలయ గ్రామంలోని సుమారు 700 మంది ప్రజలు అడవుల్లోకి పారిపోయారని తెలిసింది. వారి పరిస్థితి దుర్భరంగా వున్నదని తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X