వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజలకుఅందుబాటులో ఒప్పందాలు
హైదరాబాద్: ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ప్రజలకు అందుబాటులో వుంచాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ ట్రాన్స్కోను ఆదేశించింది. ఇందుకోసం విద్యుత్సౌధాలో తగిన ఏర్పాట్లు చేయాలని కమిషన్ సూచించింది.
2001-2002 సంవత్సరానికి విద్యుత్ టారీఫ్ ఆర్డర్ను కమిషన్ మంగళవారం నాడు జారీ చేసింది. పెద్దగా మార్పులు లేకుండా జారీ చేసిన ఈ టారీఫ్ ఆర్డర్లో 2003 సంవత్సరం నాటికి రాష్ట్రంలో వున్న వ్యవసాయ కనెక్షన్లను క్రమబద్దీకరించాలని కమిషన్ ఆదేశించింది. అసలు రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లు ఎన్నివున్నాయో లెక్క వీలున్నంత తొందరగా తేల్చాలని కమిషన్ ట్రాన్స్కోకు సూచించింది.
Comments
Story first published: Tuesday, April 17, 2001, 23:53 [IST]