వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వర్షాలతో పంటనష్టం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల భారీ వర్షాలతో పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. కృష్ణాజిల్లా బందరులో మంగళవారం ఉదయం నాలుగుగంటలపాటు కురిసిన కుంభవర్షంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. గుడివాడ డివిజన్‌లో చేతివచ్చిన వరి పంట దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దుర్భరంగా తయారయింది.

కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతులు తెచ్చిన వాము మొత్తం వర్షానికి తడసి పోయింది. కష్టపడి పండించిన ఈ వాముకు రేటు రావడం కష్టమని రైతులు కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో డివిజన్‌లో కూడా వరి ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్‌ జిల్లా నందపేట ప్రాంతంలో వరి, సజ్జా, మిర్చి పంటలు ధ్వంసం అయ్యాయి. చాలా చోట్ల మామిడి కూడా దెబ్బతిన్నది. విద్యుత్‌ స్తంబాలు కూలిపోయి, పంటలు దెబ్బతిని లక్షలాది రూపాయల మేర నష్టం వాటిల్లింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X