వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్‌ను సాగనివ్వం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తహల్కా దోషులపై ప్రభుత్వం చర్య తీసుకునే వరకు పార్లమెంట్‌ కార్యకలాపాలను తమపార్టీ ముందుకు సాగనివ్వదని ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈ విషయంలో తమ పార్టీ వైఖరి స్పష్టంగా వున్నదని ఆయన చెప్పారు.

ప్రభుత్వం వత్తిడికి తలవొగ్గి ప్రశ్నోత్తరాల సమయాన్ని సజావుగా సాగనిచ్చిన ఇతర ప్రతిపక్షపార్టీలను ఆయన విమర్శించారు. తహల్కా వ్యవహారం తేలేదాకా ప్రశ్నోత్తరాల సమయాన్ని సాగనివ్వడం అర్ధం లేదని ఆయన అన్నారు. ఏ ప్రశ్న అడిగినా అది తహల్కా మీదకే వెళ్తుందని ఆయన చెప్పారు. తహల్కా విషయంలో దోషులపై చర్యతీసుకోని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగి కూడా ప్రయోజనం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని అడిగే ప్రశ్న ఒక్కటేనని తహల్కా దోషులను దేశంలోపలి జైలుకు పంపిస్తారా లేక దేశం వెలుపల జైలుకు పంపిస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X