వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తృణమూల్లో ముసలం
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత మమతాబెనర్జీ పై ఆ పార్టీ సీనియర్ నాయకుడు అజిత్పాంజా మంగళవారం నాడు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పార్టీలో మమత నియంతలా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. పార్టీలో ఆమె వాక్కే వేదవాక్కనీ, తాను చెప్పింది తప్ప మరెవ్వరూ చెప్పింది ఆమె పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు.
సిపిఎం, కాంగ్రెస్ దొందుదొందేనని ప్రకటించిన మమత ఇప్పుడు కాంగ్రెస్తో ఎందుకు పొత్తు కలిపారో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డిఎతో తెగతెంపులు వ్యవహారంపై ఎన్నికల మానిఫెస్టోలో స్పష్టమైన వివరణలేదని ఆయన చెప్పారు. గత రెండున్నర ఏళ్లుగా తాను పార్టీలో అనేక అవమానాలను భరిస్తూ వచ్చానని ఆయన తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో, ప్రజాప్రతినిధిగా వుంటున్నతనను ఆమె అనేక సార్లు అవమానపర్చారని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, April 17, 2001, 23:53 [IST]