16 మంది భారత సైనికుల మృతి
ఢాకా: భారత్-బంగ్లా సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణల్లో 16 మంది భారతీయ సైనికులు మరణించినట్టుగా బంగ్లాదేశ్ సైనికాధికారులు ప్రకటించారు. మేఘాలయ రాష్ట్రంలోని కురిగ్రామ్లో ఉభయ దేశాల సైనికబలగాల మధ్య ఘర్షణ జరిగిందనీ ఈ ఘర్షణలో అనేకమంది గాయపడ్డారని కూడా బంగ్లా సైన్యం ప్రకటించింది.
భారత సైనికదళాలు ఏలాంటి కవ్వింపులేకుండా చొచ్చుకువచ్చి బంగ్లాదేశ్ రైఫిల్స్కు చెందిన చెక్పోస్ట్పై కాల్పులు జరిపినట్టుగా బంగ్లా రైఫిల్స్ చీఫ్ మేజర్ జనరల్ ఫజ్లూర్ రహ్మాన్ ప్రకటించారు. ఈ దాడిని తమ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని, ఈ కాల్పుల్లో 16 మంది భారతీయ సైనికులు మరణించగా బంగ్లా సైనికుడు ఒక్కరు మరణించారని ఆయన తెలిపారు.
బంగ్లా
సైనికులు
సోమవారం
రాత్రి
భారత
భూభాగంలోకి
చొచ్చుకువచ్చి
16
మంది
బిఎస్ఎఫ్
జవాన్లను
బందీలుగా
పట్టుకున్నదని
కూడా
సమాచారం
అందింది.
భారత్-బంగ్లా
సరిహద్దుల్లో
కొంత
కాలంగా
ఉభయ
దేశాల
సైనికుల
మధ్య
గొడవలు
జరుగుతున్నాయి.
సరిహద్దుల్లో
అనేక
గ్రామాలపై
రెండు
దేశాల
మధ్య
వివాదం
నడుస్తున్నది.