వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మున్సిపాలిటీలుగా మేజర్‌ పంచాయతీలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 70 మేజర్‌ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలనే ప్రతిపాదన వున్నదని మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి ఫరూఖ్‌ చెప్పారు. ఈ 70 మేజర్‌ పంచాయతీల్లో కనీసం 20 పంచాయతీలను మున్సిపాల్టీలుగా మార్చే విషయం పరిశీలిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించిన
తర్వాతనే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. 25 వేల జనాభా పైబడిన పంచాయతీలను మేజర్‌ పంచాయతీలుగా ప్రభుత్వం గుర్తించిందని ఆయన చెప్పారు. ఈ పంచాయతీల్లో రాబడి, అభివృద్ధి పనులు, వసతులు, సౌకర్యాలను చూసి మున్సిపాల్టీలుగా వేటిని మార్చాలో నిర్ణయించనున్నట్టు ఆయన చెప్పారు.

మున్సిపాల్టీలుగా మార్చాలని నిర్ణయించిన పంచాయతీల్లో అవసరమైతే ఎన్నికలను వాయిదా వేసి మున్సిపాల్టీలుగా మార్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వున్నదని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X