జెపిసికై కాంగ్రెస్ ఉడుంపట్టు
న్యూఢిల్లీః తెహల్కా అవినీతి వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేతవిచారణ జరిపించాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఉడుంపట్టు పడుతున్నది. బుధవారం పార్లమెంటు ఉభయ సభలలో కాంగ్రెస్ పార్టీ జెపిసి ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో కార్యక్రమాలను స్తంభింప చేసింది.కాంగ్రెస్ పంతం కారణంగా బుధవారం నాడు కూడా పార్లమెంట్ ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయితొలుత ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకొనేందుకు వివిధ పార్టీల సభ్యులు ప్రయత్నించగాస్పీకర్ వారిని గట్టిగా మందలించారు. దానితో ప్రశ్నోత్తరాల కార్యక్రమం సజావుగా సాగింది.
జీరో
అవర్
ప్రారంభం
కాగానే
కాంగ్రెస్
పార్టీ
సభ్యులు
లేచి
నిలబడి
తెహల్కాపై
జెపిసివిచారణకు
ఆదేశించాలని
పట్టుపట్టారు.
రాజ్యసభలో
కూడా
కాంగ్రెస్
నాయకుడు
కపిల్
సిబార్
ఇదే
వాదననువినిపించారు.
సభా
కార్యక్రమాలు
ఒక్క
అడుగు
కూడా
ముందుకు
సాగక
పోవడంతోతొలత
ఉభయ
సభలు
మధ్నాహ్నం
వరకు
వాయిదా
పడ్డాయి.
పరిస్థితిలో
మార్పు
లేకపోవడంతో
గురువారానికి
వాయిదా
వేస్తున్నట్టుగా
ప్రకటించారు.లోక్
సభలో
జెపిసివిచారణ
జరిపించాలన్న
కాంగ్రెస్
పార్టీ
డిమాండ్
కు
రాష్ట్రీయ
జనతాదళ్
మద్దతు
ఇచ్చింది.