జలయజ్ఞంపై వెబ్సైట్
హైదరాబాద్: రాష్ట్రంలో జలవనరుల పరిరక్షణకు ప్రభుత్వ సారధ్యంలో సాగుతున్న జలయజ్ఞం కార్యక్రమానికి సంబంధించిన అంశాలతో ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రానికి చెందిన ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జలయజ్ఞంపై వెచ్చించిన నిధులు, ఈ పథకం కింద చేపట్టిన పనులు, వాటిలో పురోగతి తదితర వివరాలన్నీ వెబ్సైట్లో వుంటాయని ముఖ్యమంత్రి అన్నారు.
జలయజ్ఞం మూడో విడత నీరు-మీరు మే ఒకటి నుంచి ప్రారంభం అవుతున్నదని, ఈ మూడో విడతపై 700 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఈ నిధుల వినియోగంపై గ్రామస్థాయినుంచి కట్టుదిట్టమైన ఆడిట్ను నిర్వహించనున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు.
జలయజ్ఞం
కింద
చేపట్టే
పనుల్లో
నిధుల
దుర్వినియోగానికి
పాల్పడే
వారిపై
కఠిన
చర్యలు
తీసుకోనున్నట్టుగా
ఆయన
వెల్లడించారు.
జలసంరక్షణ
కార్యక్రమంలో
భాగంగా
నీరు-మీరు
మొదటి
దశ
నిర్వహించిన
ప్రాంతాల్లో
భూగర్భ
జల
మట్టం
3.35
మీటర్ల
మేరపెరిగనట్టుగా
ఆయన
చెప్పారు.
రెండో
దశ
కార్యక్రమం
నిర్వహిస్తున్న
ప్రాంతాల్లో
కూడా
ఏ
మేర
నీటిమట్టం
పెరిగేది
చూడాల్సివున్నదని
ఆయన
చెప్పారు.
ఇతర
విభాగాలకు
చెందిన
నిధులను
కూడా
జలయజ్ఞం
కార్యక్రమం
కోసం
మళ్లిస్తున్నారనే
ఆరోపణలు
అసత్యమని
ఆయన
స్పష్టం
చేశారు.