వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కదులుతున్న లాలూపీఠం
పాట్నా: ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఈసారి పార్టీలోని అసంతృప్తివాదులనుంచిపెద్ద ప్రమాదమే ఎదురవుతూవుంది. ఆర్జెడిలో కార్యనిర్వాహక అధ్యక్షుని పదవేలేదని లాలూప్రకటించటంతో,- ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షునిగావున్న అసంతృప్తి నేత రంజన్ యాదవ్ వర్గం లాలూతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.
గురువారం నాడు రంజన్ యాదవ్ వర్గం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఎమ్మెల్యేలలో 50 శాతానికిపైగా తమవైపే వున్నారని ప్రకటించింది. దీంతో అసంతృప్తివాదులు ఇన్నేళ్లుగా ఎదురులేకుండా సాగిన లాలూ ఆధిపత్యానికి సమాధికట్టేందుకు సిద్ధమయ్యారన్నది తేలిపోయింది. ఈ నేపద్యంలో బీహార్లో తీవ్ర రాజకీయ పరిణామాలు చోటుచేసుకునేవీలుంది. అయితే, ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా, ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ అసంతృప్తి వర్గం ఎలాంటి ప్రత్యక్ష చర్యకూ పాల్పడకపోవచ్చు.
Comments
Story first published: Thursday, April 19, 2001, 23:53 [IST]