ఆడపిల్లల అమ్మకాలునిజమే
మెదక్ : రాష్ట్రంలో ఆడపిల్లలఅమ్మకాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకుఅంగీకరించింది.రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ కమీషనర్ శాలినీమిశ్రా బుధవారం నాడు ఆడపిల్లల అమ్మకాలు జరుగుతున్నమెదక్ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్, కౌడిపల్లిమండలాలలోని గిరిజన తండాలలోపర్యటించారు. వాస్తవాలు పరిశీలించిన మిశ్రా అమ్మకాలు జరుగుతున్నదివాస్తవమేనని అంగీకరించారు.
శిశువుల విక్రయాలపై నివేదికనుతయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్టు ఆమె తెలిపారు. తల్లితండ్రలు తమ పిల్లలను దత్తతనిచ్చేవిషయమై నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్తచట్టాన్ని తీసుకురానున్నట్టు ఆమె చెప్పారు. గత కొన్నిసంవత్సరాలుగా పెంచే ఆర్ధిక స్ధోమత లేని గిరిజనులు తమ పిల్లలనువిదేశీయులకు అమ్ముకుటున్న విషయం తెలిసిందే. కొంతమందిదళారులు తల్లితండ్రులను మోసంగించిపసికందులను విదేశీయులకు అమ్మివేస్తున్న సంఘటనలు కూడావెలుగు చూశాయి.