ఆగిన కాల్పులు-సడలని ఉద్రిక్తత
గౌహతి: భారత్-బంగ్లా సరిహద్దుల్లో ఉభయ దేశాల మధ్య కుదిరిన అంగీకారం మేరకు కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటికీ ఆ ప్రాంతంలో వాతావరణం మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే వున్నది. ఉభయ దేశాల సైనికుల కాల్పులతో బెదిరిపోయి ఊళ్లువదిలి పారిపోయిన సరిహద్దు గ్రామాల ప్రజలు ఇంకా ఇళ్లకు తిరిగిరాలేదు. ప్రజలను వెనక్కి రప్పించడానికి బిఎస్ఎఫ్ కృషి చేస్తున్నదని హోం మంత్రి అద్వానీ ప్రకటించారు.
కాగా బంగ్లా రైఫిల్స్ కాల్పుల్లో మరణించిన 16 మంది భారత జవాన్ల మృతదేహాలను భారత్కు అప్పగించడానికి బంగ్లా సన్నాహాలు చేస్తున్నది. సరిహద్దుల్లో శాంతికి బంగ్లా చేస్తున్న ప్రయత్నాలను భారత విదేశాంగ శాఖ శుక్రవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రశంసించింది. ఈ ప్రకటనలో జరిగిన ఘర్షణకు బాధ్యతను బంగ్లా దళాలపై నెట్టడానికి ఏలాంటి ప్రయత్నం చేయలేదు.
కాగా
షిల్లాంగ్
కేంద్రంగా
వున్న
బిఎస్ఎఫ్
ఐజి
గౌర్
మాత్రం
బంగ్లా
దళాలు
భారత
జవాన్లతో
ఎదురుకాల్పులకు
తలపడలేదనీ,
దొంగచాటుగా
దెబ్బతీశాయని
ఆరోపించారు.
ముందుగా
కొందరు
సివిల్
దుస్తుల్లో
వున్న
పౌరులు
బిఎస్ఎఫ్
జవాన్ల
దగ్గరకు
వచ్చారని,
సాధారణ
పౌరులే
కదా
అని
బిఎస్ఎఫ్
జవాన్లు
అనప్రమత్తంగా
వున్నసమయంలో
బంగ్లా
రైఫిల్స్
జవాన్లు
వచ్చి
కాల్పులకు
పాల్పడ్డారని
ఆయన
ఆరోపించారు.