జయకు ఎదురుదెబ్బ
చెన్నై: ఎన్నికల్లో పోటీ చేసేవిషయంలో అన్నాడిఎంకె అధినేత్రి జయలలితకుపెద్ద ఎదురు దెబ్బే తేలింది. అభ్యర్ధుల అర్హత విషయమై ఎన్నికలకమీషన్ అభిప్రాయాన్ని మ్రదాస్ హైకోర్టుకోరగా, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు సంబంధించి అర్హతానర్హతలను నిర్ణయించేందుకు 1997 నాటి మార్గదర్శక సూత్రాలనే ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించినట్టుగా కమిషన్ తరఫు న్యాయవాది రాజగోపాలన్ హైకోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల అధికారులకు ఆదేశాలను కూడా ఎన్నికల కమిషన్ జారీ చేసిందని ఆయన తెలిపారు.శిక్షపడిన వారిని ఎన్నికలలో పోటీకి అనుమతించేదిలేదని ఎన్నికల కమీషన్ కోర్టుకు తెలుపటంతోజయలలిత పోటీ విషయం సందేహంలోపడింది.
హైకోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఆమె సుప్రీకోర్టునుఆశ్రయించేందుకు ఇప్పటికే సిద్ధమైవుంది.అనేక అవినీతి కేసులలో కూరుకుపోయిన జయలలితరాజకీయ భవిషత్తు చివరకు సుప్రీంకోర్టు తీర్పుతోనే తేలనుంది.