చర్చ లేకుండారైల్వే బడ్జెట్కు ఆమోదం
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఎలాంటి చర్చలేకుండా రైల్వే బడ్జెట్ను లోకసభ శుక్రవారం నాడు మూజువాణి ఓటుతో ఆమోదించింది. తహల్కాపై పై ప్రతిపక్షాల గొడవతో సభరణస్థలిని మరిపిస్తున్నప్పటికీ రైల్వేబడ్జెట్ను మూజువాణి ఓటుతో గట్టెక్కించడంలో ఎన్డిఎ భాగస్వామ్యపక్షాలు సఫలం అయ్యాయి. రైల్వే బడ్జెట్తోపాటు ద్రవ్యవినియోగ బిల్లును కూడా సభ ఆమోదించింది.
ఈ వారం ఆరంభం నుంచి తహల్కా కుంభకోణంపై జెపిసి దర్యాప్తుకు డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్న కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం నాడు కూడా ప్రశ్నోత్తరాల సమయం కాగానే గొడవ ప్రారంభించారు. కాంగ్రెస్ సభ్యుల గొడవ కారణంగా సభను స్పీకర్ మధ్యాహ్నాం 3 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత రైల్వే బడ్జెట్కు ఈ నెల 25 లోపు సభ ఆమోదం లభించకుంటే ఏలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుందో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్మహాజన్ సభ్యులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.
అయితే
జెపిసి
దర్యాప్తునకు
ప్రభుత్వం
అంగీకరిస్తే
తాము
కూడా
ప్రభుత్వంతో
సహకరిస్తామని
కాంగ్రెస్
సభ్యులు
స్పష్టం
చేశారు.
ఈ
దశలో
స్పీకర్
కూడా
సభ్యులపై
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
కాంగ్రెస్
సభ్యులు
గొడవ
మానకపోవడంతో
ఈ
గందరగోళంలోనే
రైల్వేబడ్జెట్ను
అధికార
పక్షం
ఓటింగ్కు
పెట్టింది.
బడ్జెట్ను
మూజువాణి
ఓటుతో
సభ
ఆమోదించినట్టుగా
స్పీకర్
ప్రకటించారు.
రైల్వే
బడ్జెట్
వంటి
వందల
కోట్ల
రూపాయల
నిధుల
వినియోగానికి
సంబంధించిన
కీలకమైన
డాక్యుమెంట్ను
చర్చ
లేకుండా
సభ
ఆమోదించడాన్ని
కాంగ్రెస్
తీవ్రంగా
అభ్యంతరపెట్టింది.
అయితే విపక్షాల ధోరణి కారణంగానే ఇలా చేయాల్సివచ్చిందని అధికార పక్షం సమర్ధించుకున్నది. ఈ దశలో గందరగోళం శృతిమించడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. రైల్వే బడ్జెట్పై చర్చ జరపడానికి వీలుగా తహల్కాను కొద్ది రోజులు పక్కనబెట్టాల్సిందిగా తాము పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్ వినిపించుకోలేదని అధికారపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.