వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీతెహెల్కా : పార్లమెంట్‌ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ను తహల్కా నీడ వదలడం లేదు. శుక్రవారం నాడు కూడా తహల్కాపై కాంగ్రెస్‌ విపక్షాలు తీవ్ర స్థాయిలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నాన్నానికి వాయిదా వేశారు. స్పీకర్‌ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పక్షాలకు నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జెపిసి దర్యాప్తుకు ఆదేశించాల్సిందేనని కాంగ్రెస్‌ పట్టుబట్టగా సమస్యేలేదని అధికారపక్షం తేల్చిచెప్పింది.

ఈ గోడవ మధ్యనే మధ్యాహ్నం స్పీకర్‌ రైల్వే బడ్జెట్‌పై ఓటింగ్‌కు అనుమతినిచ్చారు. కాగా చర్చలేకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం వినియోగానికి సంబంధించిన రైల్వేబడ్జెట్‌ను ప్రభుత్వం మూజువాణి ఓటుతో అనుమతించడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తూర్పారబట్టింది. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక దుర్దినమని కాంగ్రెస్‌ పేర్కొంది. అయితే చర్చ లేకుండా రైల్వే బడ్జెట్‌కు సభ అనుమతి తీసుకోవడం తమకు కూడా బాధాకరంగానే వున్నదని అయితే ఈ పరిస్థితి కాంగ్రెస్‌ బాధ్యత వహించాలని అధికారపక్షం అంటున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X