పోలీస్ స్టేషన్లో పేలుడు
నెల్లూరు :డిటొనేటర్లు పేలడంతో నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ శనివారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఆరునెలల క్రితం ఒక కేసులో స్వాధీనం చేసుకున్న డిటొనేటర్లను స్టేషన్లో నిలువ వుంచగా అవి ఉన్నట్టుండి పేలిపోయాయి. రిమాండ్లో వున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా గాయపడినట్టుగా తెలిసింది.
స్టేషన్లో వున్న 7వ తరగతి ప్రశ్నాప్రతాలు, తుపాకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్టేషన్కు చుట్టుప్రక్కలవున్న ఇళ్లు బీటలువారాయి. ఈ డిటొనేటర్లను నిర్వీర్యం చేయాల్సివున్నా, హైదరాబాద్నుంచి నిపుణులు రాని కారణంగా పోలీసుస్టేషన్లోనే నిలువ వుంచామని దీంతో ఈప్రమాదం సంభవించిందని జిల్లా ఎస్.పి శ్రీనివాసరెడ్డితెలిపారు.
శనివారం
నాడు
వేకువజామున
3-3.30
ప్రాంతంలో
ఈ
ప్రమాదం
జరిగినట్టుగా
ఆయన
చెప్పారు.
పోలీసు
స్టేషన్
భవనం
బాగా
పాతది
కావడంతో
పూర్తిగా
కూలిపోయింది.
మొత్తం
నాలుగులక్షల
రూపాయలపైగా
నష్టం
జరిగివుంటుందని
అంచనా.