వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవాన్లకు అంత్యక్రియలు

By Staff
|
Google Oneindia TeluguNews

గౌహతి: బంగ్లాదేశ్‌ సైనికుల చేతుల్లో హతులైన ఇద్దురు బిఎస్‌ఎఫ్‌ జవాన్లకు శనివారం నాడు మేఘాలయలోని తురాలో సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. ఈ ఘర్షణల్లో మరణించినమరో 13 మంది జవాన్ల భౌతికకాయాలకు కూడా అంత్యక్రియలు నిర్వహించాల్సివుంది.

భారత సైనికుల మృతదేహాలను అస్సాంలోని మంకాచర్‌లో బంగ్లా సైన్యం భారత్‌కు అప్పగించింది. ఈ మృతదేహాలు కాలిన గాయాలు, చిత్రహింసల వల్ల ఛిద్రమైన శరీర భాగాలతో పూర్తిగా గుర్తుపట్టరాని స్థితిలో వున్నాయి. ఇదిలా వుండగా బంగ్లాదేశ్‌ రైఫిల్స్‌ 15 మంది బిఎస్‌ఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్నసంఘటనపై తాము విచారణకు ఆదేశాలు ఇచ్చినట్టుగా విదేశాంగమంత్రి జస్వంత్‌సింగ్‌ చెప్పారు. హోం మంత్రిత్వ శాఖ, బిఎస్‌ఎఫ్‌ ఈ సంఘటనపై వేరువేరుగా దర్యాప్తు జరుపుతున్నాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X