తిరుమల వెంకన్నసేవలో సచిన్
తిరుమలఃతన క్రికెట్ బ్యాట్ తో సంచలనాలు సృష్టిస్తున్న స్టార్ బ్యాట్స్ మెన్ సచిన్ టెండుల్కర్ శుక్రవారం భార్యా బిడ్డలతో తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నాడు. వన్డేలలో పది వేల పరుగుల మైలు రాయిని అధిగమించిన సందర్భంగా మొక్కు తీర్చుకొనేందుకు తిరుమల వచ్చినట్లు సచిన్ చెప్పాడు. తాను తిరుమల రావడం ఇదే ప్రథమం అని సంచలనాల సచిన్ వివరించాడు.
భార్య అంజలి, కుమారుడు, కుమార్తెతో సచిన్ తిరుమల రాగా రేణిగుంటవిమానాశ్రయంలో ఆయనకు టిటిడి అధికారులుస్వాగతం పలికారు. ఆ తరువాత సచిన్ భార్యా బిడ్డలతోస్వామి వారిని దర్శించుకున్నాడు. శుక్రవారం తిరుమలలో విపరీతమైన రద్దీ వుండడంతోవిఐపి దర్శనాన్ని రద్దు చేశారు. దీనితో సచిన్ దంపతులు కొద్దిసేపు క్యూలో నిలబడే స్వామి వారిని దర్శించుకున్నారు.
సచిన్
వస్తున్నాడనే
వార్త
తెలియడంతో
ఆయన
అభిమానులుపెద్ద
సంఖ్యలో
రేణిగుంట
విమానాశ్రయం
చేరుకున్నారు.
సచిన్
కు
జేజేలు
పలికారు.
సచిన్
బస
చేసిన
పద్మావతి
అతిథి
గృహం
వద్ద,
వైకుంఠం
క్యూ
కాంప్లెక్స్
వద్ద
కూడా
సచిన్
అభిమానులను
అదుపు
చేయడం
టిటిడి
సిబ్బందికి
గగనమైంది.
శనివారం
ఉదయం
కూడా
సచిన్
వేంకటేశ్వరస్వామిని
దర్శించు
కున్నారు.
సచిన్
దంపతులకు
దేవాలయఅర్చకులు
స్వామి
వారి
తీర్థ
ప్రసాదాలను
అందజేశారు.