వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దత్తతకేంద్రాలపై సిబిసిఐడి విచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దత్తత పేరుతో పసి పిల్లలవిక్రయాలకు పాల్పడుతున్న కేంద్రాల వ్యవహారాలపై సిబిసిఐడివిచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు తెలిపారు. రంగారెడ్డి జిల్లాతాండూరులోని జాన్‌ బెథాని మెమోరియల్‌హోమ్‌లో పిల్లల మరణంపై, విక్రయంపై దర్యాప్తు చేయించిదోషులను కఠిన శిక్షిస్తామని ఆయన చెప్పారు. ఈ దత్తతకేంద్రంలో నలుగురు పిల్లలు మరణించడంపై, పలువురుఅస్వస్థతకు గురి కావడంపై, పిల్లలను విక్రయిస్తున్నారనేఆరోపణలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు.

దత్తత కేంద్రం పేరుతో పిల్లలవిక్రయాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామనిఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న పిల్లలను ఆయన ఆదివారంనాడుపరామర్శించారు. నీలోఫర్‌ ఆస్పత్రిలో 15 మంది పిల్లలు చికిత్సపొందుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులను ఆయనతాండూరు పంపించారు. మరణించిన పిల్లలనుకేంద్రంలో ఖననం చేయడంపై చంద్రబాబునాయుడు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X