వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూఢచార వైఫల్యంలేదు: కమల్‌ పాండే

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌పైబంగ్లాదేశ్‌ రైఫిల్స్‌ (బిడిఆర్‌) దాడి విషయంలోగూఢచార వైఫ్యలమేదీ లేదని హోంశాఖకార్యదర్శి కమల్‌ పాండే స్పష్టం చేశారు. భారతసరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాన్లును హింసించడానికి, కిరాతకంగా 16మందిని చంపడానికి బాధ్యులైనవారిపైబంగ్లాదేశ్‌ ప్రభుత్వం తీసుకునే చర్య కోసంనిరీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అధ్యక్షతన ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశానంతరంఆయన విలేకరులతో మాట్లాడారు. భారత జవాన్లనుఎనమండుగుర్ని పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చిచంపినట్లు, భారత జవాన్లను తీవ్రచిత్రహింసలకు గురిచేసినట్లుఆనవాళ్లున్నాయని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌రైఫిల్స్‌ చర్యను ఆయన తీవ్రంగా నిరసించారు.

హోంమంత్రి ఎల్‌.కె. అద్వానీ, రక్షణ మంత్రిజస్వంత్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు బ్రజేశ్‌మిశ్రా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కె.సి. పంత్‌ తదితరులు ఈ ఉన్నతస్థాయిసమావేశంలో పాల్గొన్నారు. బిఎస్‌ఎఫ్‌ జవాన్ల హత్యపైబంగ్లాదేశ్‌ విచారణ తర్వాత భారత్‌ భవిష్యత్తు కార్యక్రమాన్నిప్రకటిస్తుందని కమల్‌ పాండే చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X