వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమానికి సర్కార్‌ సిబ్బందిస్వస్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ సిబ్బంది నాలుగు రోజులుగా సాగిస్తున్న నిరసన ఉద్యమాన్ని ఉపసంహరించు కున్నారు. ఉద్యోగులకు భద్రతపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నెల 19 నుంచి చేపడుతున్న దశలవారీ ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక నేతలు సోమవారం ప్రకటించారు. జె.ఎ.సి. నేతలు పూర్ణచంద్రరావు,స్వామినాధన్‌ తదితరులు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించడంతో ఉద్యమాన్ని విరమించుకుంటున్నట్లు వారు వెల్లడించారు.

30 డిమాండ్లతో రాష్ట్రంలోని ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు, కార్మికులు ఈ నెల 19 నుంచి దశలవారీగా ఉద్యమం చేస్తున్న విషయం విదితమే. ఉద్యోగులను ఇష్టం వచ్చిన విధంగా తొలగిస్తున్నారని, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారంటూ ఐక్య సంఘాలు ధ్వజమెత్తాయి. జెఎసి నేతలు మంత్రి వర్గ ఉపసంఘంతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం జరిపిన చర్చలలో ఉద్యోగులు- ప్రభుత్వానికి మధ్య ఒక అంగీకారం కుదిరింది.

ఉద్యోగులు చేస్తున్న 30 డిమాండ్లలో 20 డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించింది. ఉద్యోగ సంఘాలను సంప్రదించకుండా ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించమని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. బ్యాక్‌ లాగ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం పాక్షికంగా సమ్మతించింది. ఉద్యోగుల డిమాండ్లకు అంగీకరించినప్పటికీ ప్రభుత్వ శాఖలలో సంస్కరణలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించడం విశేషం. అవసరమైన శాఖలలో ఉద్యోగుల నేతలు, ఆ శాఖల అధిపతులు కలిసి చర్చించి, అధిక వ్యయాన్ని తగ్గిస్తారని చంద్రబాబు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X