పిల్లల స్వచ్ఛంద దత్తతపై నిషేధం
హైదరాబాద్:తలిదండ్రులు స్వచ్ఛందంగా పిల్లలను దత్తతఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. సోమవారం ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దత్తతలైసెన్స్ విధానాన్ని మార్చాలని మంత్రి వర్గంనిర్ణయించింది. కొత్త నియమ నిబంధనలనునోటిఫై చేయనున్నట్లు సమావేశానంతరం రాష్ట్రసమాచార, పౌర సంబంధాల మంత్రి శివప్రసాద్విలేకరుల సమావేశంలో చెప్పారు. దత్తతకేంద్రాలపై నిఘాకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖడైరెక్టర్ చైర్మన్గా ఒక బోర్డును ఏర్పాటుచేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ బోర్డుఆరేళ్లు పని చేస్తుంది. గిరిజన పిల్లల దత్తతకుఅడ్డుకట్ట వేయడానికి కొత్త విధానం ఉపయోగపడుతుందనిశివప్రసాద్ చెప్పారు.
గుర్తింపు రద్దు
ఇదిలా వుండగా, రంగారెడ్డి జిల్లాలోనితాండూరులో గల అబ్రహం బెథాని హోమ్ గుర్తింపునుకేంద్ర ప్రభుత్వం సోమవారం రద్దుచేసింది. తాండూరులోని అబ్రహం బెథానిహోమ్ను సోమవారం సిబిసిఐడి అధికారులు తనిఖీ చేసి రికార్డులనుపరిశీలించారు. హోమ్ అవకతవకలకుపాల్పడినట్లు రికార్డుల పరిశీలనలో తేలింది. తమనివేదికను రెండు నెలల్లో సమర్పిస్తామని ఐజిజయచంద్ర చెప్పారు. హోమ్ నిర్వాహకులుపరారీలో వున్నారు.
సంజీవరావు అరెస్టు
యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సంజీవరావును సోమవారంహైదరాబాద్లోని ముషిరాబాద్ పోలీసులు అరెస్టుచేశారు. దత్తత తీసుకున్న పిల్లలను సంజీవరావువిక్రయిస్తున్నట్లు రెండేళ్ల క్రితం ఆరోపణలువచ్చాయి. హైదరాబాద్లోని గాంధీనగర్లో గలయాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్కార్యాలయం నుంచి పోలీసులు 34 మంది పసిపిల్లలనుస్వాధీనం చేసుకున్నారు. దత్తతకుసంబంధించి సంజీవరావు బోగస్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు తేలిందని పోలీసులుచెప్పారు.