బాబుకు హక్కుల ట్రిబ్యునల్ షాక్
హైదరాబాద్ః కరెంటు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా గత ఏడాది ఆగస్టులో జరిగిన ప్రదర్శనపై ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపారని మానవహక్కుల సంఘం ఆరోపించింది. గత ఏడాది ఆగస్టు 28న హైదరాబాద్ లో జరిగిన అసెంబ్లీ ముట్టడి ఉద్యమ కారులపై పోలీసులు పాశవికంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన పోలీసుల కాల్పులలో ముగ్గురు మరణించగా వందలాది మంది గాయపడ్డారు.
ఉద్యమకారులు
రెచ్చగొట్టిన
కారణంగానే
తాము
కాల్పులు
జరిపామంటూ
పోలీసులు
వివరణ
ఇచ్చారు.
అయితే
ఉద్యమకారులు
ఏ
మాత్రం
కవ్వింపు
చర్యలకు
పాల్పడిన
దాఖలాలు
లేవని
ట్రిబ్యునల్
అభిప్రాయపడింది.
వామపక్ష
నేతల
ఫిర్యాదు
మేరకు
జాతీయ
మానవహక్కుల
సంఘం
సారధ్యంలోని
ఇద్దరు
సభ్యులు
గల
బృందం
బషీర్
బాగ్
కాల్పుల
పై
బహిరంగ
విచారణ
జరిపింది.
ఈ
విచారణకు
రాష్ట్ర
ప్రభుత్వం
తరపున
ఏ
ఒక్కరూ
హాజరు
కాలేదు.
ఈ
అంశాన్ని
కూడా
మానవహక్కుల
ట్రిబ్యునల్
తప్పు
పట్టింది.
పోలీసు
శాఖ
పాశవిక
వైఖరిని
ఖండిస్తూ
కాల్పులలో
మరణించిన
ముగ్గురికి
5
లక్షల
నష్టపరిహారం
చెల్లించాల్సిందిగా
ట్రిబ్యునల్
సిఫారసు
చేసింది.
అదే
విధంగా
ఈ
సందర్భంగా
గాయపడిన
వారికి
50
వేల
పరిహారం
ఇవ్వాల్సిందిగా
కూడా
ట్రిబ్యునల్
కోరింది.
ఈ
నివేదికపై
మానవహక్కుల
సంఘం
సారధి
కృష్ణఅయ్యర్
సంతకం
కూడా
చేశారు.
ఈ
నివేదికను
అంతర్జాతీయ
హక్కుల
సంఘం,
ఆసియా
దేశాల
హక్కుల
సంఘానికి
కూడా
పంపుతున్నట్లు
ట్రిబ్యునల్
కన్వీనర్
సోమవారం
హైదరాబాద్
లో
చెప్పారు.