సడలింపులకు నాస్కామ్ వినతి
బెంగుళూర్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) సాఫ్ట్వేర్, సర్వీసులలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ ప్రొఫెషనల్స్కు వర్క్ పర్మిట్లు, వీసాలు ఇవ్వడంలో మరింత సరీళకృత విధానాలను, పారదర్శకతను ప్రవేశపెట్టాలని జాతీయ సాఫ్ట్వేర్, సర్వీసుల కంపెనీల సంఘం (నాస్కామ్) సోమవారం ఐరోపా దేశాలను కోరింది.
ఉభయ దేశాల మధ్య ఐటి సంబంధాలను పటిష్టానికి ఇక్కడ జరిగిన భారత-నార్వే సదస్సులో నాస్కామ్ తన పత్రాన్ని సమర్పించింది. భారత నిపుణులను భారత సాఫ్ట్వేర్ కంపెనీలు ఐరోపావ్యాప్తంగా పంపడానికి వీలుగా బెల్జియం, నార్వే, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ వంటి దేశాలు ప్రత్యేక పథకాలతో ముందుకు రావాలని నాస్కామ్ కోరింది. ఇది ఉభయత్రా లాభదాయకం కాగలదని అభిప్రాయపడింది.
జర్మనీ ప్రభుత్వం భారత సాఫ్ట్వేర్ నిపుణులకు గ్రీన్ కార్డు ఇవ్వడం ఈ దిశలో తీసుకున్న చర్యనే. తమ దేశంలోకి భారత సాఫ్ట్వేర్ నిపుణులను ఇతోధికంగా ఆహ్వానిస్తామని నార్వే ప్రధాన మంత్రి జెన్స్ స్టోల్టెన్బర్గ్ తన కీలకోపన్యాసంలో చెప్పారు.
భారత
ఇంజనీర్ల
వర్క్
పర్మిట్లలో
సడలింపులకు
నాస్కామ్
ఐరోపా
దేశాలను
సంప్రదించే
దిశలో
పని
చేస్తోంది.
ఈ
చర్యల
వల్ల
వచ్చే
మూడేళ్లలో
ఐరోపా
దేశాలకు
భారత
సాఫ్ట్వేర్
ఎగుమతులు
నాలుగు
బిలియన్
కోట్ల
డాలర్లకు
పెరగగలవని
అంచనా.
భారత
సాఫ్ట్వేర్
నిపుణులకు
ఫ్రెంచ్,
జెర్మన్,
ఇటాలియన్
వంటి
బాషలను
నేర్పే
పథకాలు
కూడా
భారతదేశంలో
అమలు
కాబోతున్నాయి.