అధికారులపై బాబుఆగ్రహం
హైదరాబాద్: నీరు-మీరు కార్యక్రమానికినిధులు విడుదల చేయడంలో జాప్యం చేసినఅధికారులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా నిధుల జాప్యంపై తనదృష్టికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిఅధికారులను తీవ్రంగా మందలించారు.
నేను ఎక్కువ మాట్లాడితేమీరు బాధపడ్తారు అని ఆయన ఒక అధికారినిఉద్దేశించి అన్నారు. స్వయం సహాయక బృందాలకువెంటనే అడ్వాన్స్లు విడుదల చేయాలని ఆయనఅధికారులకు సూచించారు. అధికార వీకేంద్రీకరణకుసహకరించాలని ఆయన అధికారులను కోరారు.
జూన్ ఒకటవ తేదీ నుంచి 10వ తేదీవరకు స్త్రీ, శిశు జన్మభూమిని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రిచెప్పారు. ఈ 15వ విడత జన్మభూమిని వినూత్న రీతిలోనిర్వహిస్తామని ఆయన జిల్లా కలెక్టర్లతోఅన్నారు. స్త్రీ, శిశు సంక్షేమానికి తాము రాష్ట్రస్థాయిలో కసరత్తు చేసి ప్రణాళికలు రూపొందించామని, జిల్లాస్థాయిలో కలెక్టర్లు ఇదే విధమైన కసరత్తుచేయాలని ఆయన అన్నారు.
బియ్యం సేకరణపైఅఖిల పక్షం
రాష్ట్రంలో బియ్యం సేకరణపై ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారంఅఖిల పక్ష సమావేశం జరిగింది. బియ్యం సేకరణకు ప్రభుత్వం తగినచర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రతిపక్షాలవిమర్శలను ప్రభుత్వం, అధికారతెలుగుదేశం పార్టీ ఖండించాయి. భారతఆహార సంస్థ (ఎఫ్సిఐ) 70 లక్షల టన్నుల బియ్యం రైతులనుంచి సేకరించాల్సి వుండగా 40 లక్షల టన్నులు మాత్రమే సేకరించడం పట్ల ప్రతిపక్షాలునిరసన వ్యక్తం చేశాయి.
పంజాబ్, హర్యానా, తదితర రాష్ట్రాల్లో మాదిరిగా రైతుల నుంచిఎఫ్సిఐ బియ్యం సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనిగాదె వెంకటరెడ్డి (కాంగ్రెస్) అన్నారు. ప్రమాణాలు సరిగా లేవనిఎఫ్సిఐ రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు నిరాకరిస్తోందని, ఆబియ్యాన్నే మిల్లర్లు తక్కువ ధరకుకొంటున్నారని, దీన్నే మిల్లర్లు ఎఫ్సిఐకి విక్రయిస్తున్నారని కొరటాలసత్యనారాయణ (సిపిఎం) అన్నారు. బియ్యం సేకరణకు తగినమౌలిక సదుపాయాలు లేవని ఎన్. ఇంద్రసేనా రెడ్డి(బిజెపి) అభిప్రాయపడ్డారు.